అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు --పోతరాజు జహంగీర్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్ అన్నారు మంగళవారం రోజున గ్రామపంచాయతీ కార్మికుల గౌరవ అధ్యక్షులు పల్లెపాటి లక్ష్మీ నరసయ్యను, నన్ను పోలీసులు అరెస్టు చేసి తుర్కపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ ఈరోజు గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు తమ సమస్యలు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించి పర్మినెంట్ చేయాలని వారి జీతాలు ప్రభుత్వమే నేరుగా వారి అకౌంట్లో వేయాలని బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం కాకుండా ఉండేందుకు కార్మిక నాయకులను గ్రామ పంచాయతీ ఉద్యోగులను అరెస్టు చేయటం సిగ్గుచేటు అని అన్నారు ధర్నా కోసం పది రోజులు ముందస్తుగా అనుమతి కోరినప్పటికీ అనుమతి ఇస్తామంటూ మార్చి 16 అర్ధరాత్రి వరకు నాన్చి అనుమతిని నిరాకరించి తెల్లవారేసరికి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉద్యమాలను అణచివేస్తుందని నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వాన్ని విమర్శించారు