
కేటీఆర్కు అయ్యప్ప ప్రసాదం అందజేసిన దావ వసంత సురేష్
NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR)ను జగిత్యాల జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, ఇతర జిల్లా నాయకులతో కలిసి కేటీఆర్ను కలిసి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేటీఆర్తో చర్చించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొని జిల్లా నాయకులతో ముచ్చటించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీకి వెన్నెముకగా నిలిచిన దావ వసంత సురేష్ దంపతుల సేవలను పార్టీ శ్రేణులు గుర్తు చేసుకున్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube