BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

బీసీ మహిళలకు సబ్ కోట కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి: జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్

తెలంగాణ
/ మంచిర్యాల
16 Mar, 2026 - 08:39 AM
64 వీక్షణలు

బీసీ మహిళలకు సబ్ కోట కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి: జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్

తేదీ: 16 మార్చి, 2026

మంచిర్యాల: చట్టసభల్లో మహిళలకు కల్పించే రిజర్వేషన్లలో సామాజిక న్యాయం సాధించాలని, వెనుకబడిన వర్గాలకు (బీసీ) చెందిన మహిళలకు సబ్ కోట కల్పించేలా బిల్లును రూపొందించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎలాంటి ఉపకోట లేకపోవడం వల్ల బీసీ మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 1952వ సంవత్సరం నుండి ఇప్పటివరకు అసెంబ్లీకి 94 మంది మహిళలు ఎన్నికైతే, అందులో అగ్రకులాల మహిళలు 54 మంది ఉన్నారని, బీసీ మహిళలు కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉండటం స్పష్టమైన వివక్ష అని వారు ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాలో కేవలం 2 శాతం ఉన్న అగ్రకుల మహిళలు 54 మంది ఎన్నికైతే, 30 శాతానికి పైగా ఉన్న బీసీ మహిళలు కేవలం ఎనిమిది మంది మాత్రమే ఎన్నికవ్వడం సామాజిక అన్యాయమని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపకోట ప్రకటించాలని, లేనిపక్షంలో మహిళా లోకాన్ని జాగృతం చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, జిల్లా నాయకులు గజ్జెల్లి వెంకన్న, వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: శ్రీనివాస్,