BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

బీసీ మహిళలకు సబ్ కోట కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి: జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Mar, 2026 - 08:39 AM
113 వీక్షణలు

బీసీ మహిళలకు సబ్ కోట కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి: జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్

తేదీ: 16 మార్చి, 2026

మంచిర్యాల: చట్టసభల్లో మహిళలకు కల్పించే రిజర్వేషన్లలో సామాజిక న్యాయం సాధించాలని, వెనుకబడిన వర్గాలకు (బీసీ) చెందిన మహిళలకు సబ్ కోట కల్పించేలా బిల్లును రూపొందించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎలాంటి ఉపకోట లేకపోవడం వల్ల బీసీ మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 1952వ సంవత్సరం నుండి ఇప్పటివరకు అసెంబ్లీకి 94 మంది మహిళలు ఎన్నికైతే, అందులో అగ్రకులాల మహిళలు 54 మంది ఉన్నారని, బీసీ మహిళలు కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉండటం స్పష్టమైన వివక్ష అని వారు ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాలో కేవలం 2 శాతం ఉన్న అగ్రకుల మహిళలు 54 మంది ఎన్నికైతే, 30 శాతానికి పైగా ఉన్న బీసీ మహిళలు కేవలం ఎనిమిది మంది మాత్రమే ఎన్నికవ్వడం సామాజిక అన్యాయమని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపకోట ప్రకటించాలని, లేనిపక్షంలో మహిళా లోకాన్ని జాగృతం చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, జిల్లా నాయకులు గజ్జెల్లి వెంకన్న, వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: శ్రీనివాస్,