BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

బీటీ రణదీవే స్ఫూర్తితో కార్మిక పోరాటాలు నిర్మించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట / బీబీనగర్
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
06 Apr, 2026 - 05:21 PM
98 వీక్షణలు

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గొరిగె సోములు

భారత కార్మిక ఉద్యమ నాయకుడు బిటి రణదీవే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటిత ఉద్యమాలు నిర్మించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోరిగె సోములు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు మండల కార్యాలయంలో భారత కార్మిక ఉద్యమ నాయకులు,సిఐటియు మొదటి అఖిలభారత అధ్యక్షులు బిటి రణదీవే 36వ వర్ధంతి సందర్భంగా మండల కమిటీ ఆధ్వర్యంలో పూలమాలవేసి చిత్రపటానికి జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల జీవితాలతో ఆటలాడుతోందని ఏప్రిల్ ఒకటి నుండి లేబర్ కోడ్లు అమలవుతున్నాయని కార్మికులపై పెను భారాలు మోపుతున్నాయని అన్నారు. చేసిన పనికి కనీస వేతనాలు రాకుండా, సంఘాలు పెట్టుకోకుండా పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఎర్రతివాచీలు పరుస్తుందని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా కార్మిక లోకమంతా రోడ్లమీద కొచ్చి సమ్మె నిర్వహించి నిరసన తెలిపిన ప్రభుత్వంలో చలనం లేదని కార్మిక వ్యతిరేక చట్టాలపై స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీటీ రణదీవే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో కార్మికులను ఏకం చేసి సిఐటియు పోరాడుతుందని ఈ పోరాటంలో కార్మికులంతా కలిసి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరేకంటి రాము, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి వెంకటేశం, భవణ  నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వంగాల మారయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటెపాక శివకుమార్,స్వామి తదితరులు పాల్గొన్నారు.