www.ntodaynews.com
బిజెపి నేత రఘునాథ్ గృహ నిర్బంధం
తెలంగాణ
/
మంచిర్యాల
బిజెపి నేత రఘునాథ్ గృహ నిర్బంధం
మంచిర్యాల: ఆరు గ్యారంటీలు అమలు చేయాలని కోరుతూ బిజెపి ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాలలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో బిజెపి నేత రఘునాథ్ ను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు.
సోమవారం ఉదయం ఆయన నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతుండగా, పోలీసులు ఆయన నివాసానికి చేరుకుని బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ప్రజల పక్షాన బిజెపి పోరాటం కొనసాగుతుందని, గ్యారంటీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు