BREAKING
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి శైలజ దుర్మరణం అగ్నిప్రమాద బాధితులకు పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ఉద్యమకారుల వేదిక చిట్యాల అధ్యక్షుడిగా చికిలంమెట్ల అశోక్ నియామకం ​ పెద్ద కాపర్తి శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు, అసలైన దొంగలు వేలాగ్రా ఎరువులు సరఫరా చేసినా నకిలీ డీలర్లే.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో మార్పులు మహిళల భద్రతకు 'ఆపరేషన్ దండాయన'.. నిందితులపై నిరంతర నిఘా ఉంచాలి: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ రాహుకాల అభిషేకానికి విశేష స్పందన పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి శైలజ దుర్మరణం అగ్నిప్రమాద బాధితులకు పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ఉద్యమకారుల వేదిక చిట్యాల అధ్యక్షుడిగా చికిలంమెట్ల అశోక్ నియామకం ​ పెద్ద కాపర్తి శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు, అసలైన దొంగలు వేలాగ్రా ఎరువులు సరఫరా చేసినా నకిలీ డీలర్లే.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో మార్పులు మహిళల భద్రతకు 'ఆపరేషన్ దండాయన'.. నిందితులపై నిరంతర నిఘా ఉంచాలి: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ రాహుకాల అభిషేకానికి విశేష స్పందన పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు
www.ntodaynews.com

బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ నినాదాన్ని అందరూ అమలుపరచాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
14 Apr, 2026 - 06:51 PM
64 వీక్షణలు

బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ నినాదాన్ని అందరూ అమలుపరచాలి--యాస భాస పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పండుగ ప్రభాకర్

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఊట్ల రమేష్ మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యాస భాస పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పండుగ ప్రభాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక చైతన్యం - అంబేద్కర్ ఆశయ సాధన ​గౌరవనీయులైన సభాధ్యక్షులకు, వేదికను అలంకరించిన పెద్దలకు మరియు నా సోదర సోదరీమణులకు వందనాలు తెలిపారు ​నేడు మనం ఒక ముఖ్యమైన సందర్భంలో ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించిన మూడు అమూల్యమైన సూత్రాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అని అన్నారు "బోధించు, సమీకరించు, పోరాడు." అని నినాదాన్ని అమలుపరచాలని అన్నారు

​1. బోధించు (Educate)

​విద్య అనేది కేవలం డిగ్రీల కోసం కాదు. అది నిరంతరం సాగే ఒక ప్రక్రియ. విద్య ద్వారానే మనం జ్ఞానాన్ని పొంది, సమాజంలో మన హక్కులేమిటో తెలుసుకోగలం. చదువుకున్న ప్రతి ఒక్కరూ తమ జ్ఞానాన్ని పదిమందికి పంచాలి.

​2. సమీకరించు (Organize)

​ఒకటిగా ఉంటేనే బలం. మనందరం ఒకే ఆశయం కోసం, ఒకే లక్ష్యం కోసం ఐక్యమవ్వాలి. సమస్యలు ఎదురైనప్పుడు కలిసికట్టుగా నిలబడటమే 'సమీకరించు' అనే మాటకు నిజమైన అర్థం.

​3. పోరాడు (Agitate)​ఇక్కడ పోరాటం అంటే హింస కాదు. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం, మన హక్కుల కోసం శాంతియుత మార్గంలో నిలబడటం. ఎక్కడైతే అణచివేత ఉంటుందో, అక్కడ చైతన్యం రావాలి.​జీవితంలో మనం అలవర్చుకోవాల్సిన విలువలు​ఓటమిని అంగీకరించవద్దు మనకు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కుంగిపోకూడదు అని అన్నారు అపజయం ఎదురైనప్పుడు మరింత పట్టుదలతో ముందుకు సాగాలి.వంద ఏళ్లు బానిసగా బ్రతకడం కంటే, ఒక్క రోజైనా ఆత్మగౌరవంతో, సింహంలా బ్రతకడం మిన్న అని అన్నారు మన గౌరవాన్ని మనం ఎప్పుడూ తాకట్టు పెట్టకూడదు అని,ఒక నిజమైన నాయకుడు అంటే తన వర్గం కోసం, తన ప్రజల కోసం కష్టపడేవాడు. అందరినీ సమన్వయపరుస్తూ మార్గదర్శకుడిగా నిలవాలి.చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే, ఒక చిన్న దీపాన్ని వెలిగించడం మేలు అని అన్నారు అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ, సమానత్వం కోసం, సామాజిక మార్పు కోసం మనమందరం కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం,గ్రామ సర్పంచ్ దొమ్మాట రమాదేవి శంకర్, ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మైలారం సంజీవ,నాయకులు పోలగోని వెంకటేష్ గౌడ్,బోనంకూర మల్లేష్,గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంబాబు,వార్డు సభ్యులు, నాయకులు మైలారం నరసింహ, ఊట్ల రమేష్, ఊట్ల రాజు,పగడిపల్లి వెంకటేష్, మైలారం సుదర్శన్, మైలారం ఆశయ్య,మైలారం మహేష్,జల్ల శ్రీరాములు,బోనంకూర సహదేవ్, ఆదర్శ యూత్ సభ్యులు మైలారం అనిల్, ఊట్ల గణేష్, ఊట్ల ప్రవీణ్,బాసారం శ్రీరాములు,బాసారం లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు