భద్రాద్రి రామయ్య గోత్ర వివాదం.. నేడు హైకోర్టులో కీలక విచారణ
భద్రాద్రి రామయ్య గోత్ర వివాదం.. నేడు హైకోర్టులో కీలక విచారణ
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామయ్య గోత్రంపై నెలకొన్న వివాదం హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.
ఇప్పటివరకు ఆలయంలో సంప్రదాయంగా స్వామిని వశిష్ఠ గోత్రికుడిగా, సీతమ్మను గౌతమ గోత్రంగా పూజించేవారు. అయితే 2012 తర్వాత కొంతమంది పండితులు స్వామిని “అచ్యుత”, అమ్మవారిని “సౌభాగ్య” గోత్రాలుగా పేర్కొంటూ పూజలు నిర్వహించడం ప్రారంభించారు.
ఈ మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2022లో ఓ భక్తుడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు నియమించిన కమిటీ పరిశీలన జరిపి దేవాదాయ శాఖకు నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదికను ప్రజలకు వెల్లడించకపోవడంతో, సంబంధిత భక్తుడు మళ్లీ కోర్టును ఆశ్రయించారు.
భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ సున్నిత అంశంపై నేడు జరగనున్న విచారణలో కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.