BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

భద్రాద్రి రామయ్య గోత్ర వివాదం.. నేడు హైకోర్టులో కీలక విచారణ

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:48 PM
65 వీక్షణలు

భద్రాద్రి రామయ్య గోత్ర వివాదం.. నేడు హైకోర్టులో కీలక విచారణ

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామయ్య గోత్రంపై నెలకొన్న వివాదం హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.

ఇప్పటివరకు ఆలయంలో సంప్రదాయంగా స్వామిని వశిష్ఠ గోత్రికుడిగా, సీతమ్మను గౌతమ గోత్రంగా పూజించేవారు. అయితే 2012 తర్వాత కొంతమంది పండితులు స్వామిని “అచ్యుత”, అమ్మవారిని “సౌభాగ్య” గోత్రాలుగా పేర్కొంటూ పూజలు నిర్వహించడం ప్రారంభించారు.

ఈ మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2022లో ఓ భక్తుడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు నియమించిన కమిటీ పరిశీలన జరిపి దేవాదాయ శాఖకు నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదికను ప్రజలకు వెల్లడించకపోవడంతో, సంబంధిత భక్తుడు మళ్లీ కోర్టును ఆశ్రయించారు.

భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ సున్నిత అంశంపై నేడు జరగనున్న విచారణలో కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.