www.ntodaynews.com
నిత్యకళారాధనలో భాగంగా భక్తిరంజని కార్యక్రమం
తెలంగాణ
శ్రీశైలంలో నిత్యకళారాధనలో భాగంగా భక్తిరంజని కార్యక్రమం
NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 05.03.2026న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీ ఆచంట లక్ష్మీ శ్రీనివాస నామ సంకీర్తన బృందం ఆధ్వర్యంలో భక్తిరంజని కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుంచి ప్రారంభమైంది. కార్యక్రమంలో గణపతి ప్రార్థన, ఓంకారనాదం, కైలాసపతే సదాశివ, చంద్రశేఖరాయ నమ, గిరిజారమణ దురిత నివారణ, శివ శివ భవభవ వంటి పలు శివకీర్తనలను ఎ. లక్ష్మీ శ్రీనివాస్ ఆలపించారు. సహకార గాయకులుగా రాంబాబు, రమణ, ప్రసాద్ పాల్గొన్నారు.
కార్యక్రమానికి హార్మోనియంపై ప్రసాద్, డోలక్పై దొరబాబు సంగీత సహకారం అందించారు.
దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ స్వామి, అమ్మవార్లకు కైంకర్యాలు పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
(కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు శ్రీశైల దేవస్థానం ద్వారా జారీ చేసిన ప్రకటన)
#Srisailam #NithyaKalaradhana #BhaktiRanJani #SpiritualPrograms #TempleCulture #AndhraPradeshTemples #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube