BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

నిత్యకళారాధనలో భాగంగా భక్తిరంజని కార్యక్రమం

తెలంగాణ
05 Mar, 2026 - 09:12 AM
362 వీక్షణలు
శ్రీశైలంలో నిత్యకళారాధనలో భాగంగా భక్తిరంజని కార్యక్రమం NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 05.03.2026న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీ ఆచంట లక్ష్మీ శ్రీనివాస నామ సంకీర్తన బృందం ఆధ్వర్యంలో భక్తిరంజని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుంచి ప్రారంభమైంది. కార్యక్రమంలో గణపతి ప్రార్థన, ఓంకారనాదం, కైలాసపతే సదాశివ, చంద్రశేఖరాయ నమ, గిరిజారమణ దురిత నివారణ, శివ శివ భవభవ వంటి పలు శివకీర్తనలను ఎ. లక్ష్మీ శ్రీనివాస్ ఆలపించారు. సహకార గాయకులుగా రాంబాబు, రమణ, ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమానికి హార్మోనియంపై ప్రసాద్, డోలక్‌పై దొరబాబు సంగీత సహకారం అందించారు. దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ స్వామి, అమ్మవార్లకు కైంకర్యాలు పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. (కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు శ్రీశైల దేవస్థానం ద్వారా జారీ చేసిన ప్రకటన) #Srisailam #NithyaKalaradhana #BhaktiRanJani #SpiritualPrograms #TempleCulture #AndhraPradeshTemples #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube