BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

నిత్యకళారాధనలో భాగంగా భక్తిరంజని కార్యక్రమం

తెలంగాణ
05 Mar, 2026 - 09:12 AM
310 వీక్షణలు
శ్రీశైలంలో నిత్యకళారాధనలో భాగంగా భక్తిరంజని కార్యక్రమం NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 05.03.2026న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీ ఆచంట లక్ష్మీ శ్రీనివాస నామ సంకీర్తన బృందం ఆధ్వర్యంలో భక్తిరంజని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుంచి ప్రారంభమైంది. కార్యక్రమంలో గణపతి ప్రార్థన, ఓంకారనాదం, కైలాసపతే సదాశివ, చంద్రశేఖరాయ నమ, గిరిజారమణ దురిత నివారణ, శివ శివ భవభవ వంటి పలు శివకీర్తనలను ఎ. లక్ష్మీ శ్రీనివాస్ ఆలపించారు. సహకార గాయకులుగా రాంబాబు, రమణ, ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమానికి హార్మోనియంపై ప్రసాద్, డోలక్‌పై దొరబాబు సంగీత సహకారం అందించారు. దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ స్వామి, అమ్మవార్లకు కైంకర్యాలు పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. (కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు శ్రీశైల దేవస్థానం ద్వారా జారీ చేసిన ప్రకటన) #Srisailam #NithyaKalaradhana #BhaktiRanJani #SpiritualPrograms #TempleCulture #AndhraPradeshTemples #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube