రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని కందుకూరు ఆర్డీవో, మండల తహసిల్దార్
భూ పరిపాలన కమిషనర్ తెలంగాణ హైదరాబాద్, (CCLA)
ప్రజా ప్రభుత్వంలో రైతుల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తామని చెబుతున్న ప్రభుత్వం అవి మాటలకే పరిమితమయ్యే విధంగా ఉన్నాయి రెవిన్యూ అధికారులు రైతులను పట్టించుకోకపోవడం,సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతుల సమస్యను పరిష్కరించడంలో విఫలమవుతున్నారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా,కందుకూరు మండలంలో ఉన్న ఆర్డిఓ,తహసిల్దార్ కార్యాలయ అధికారులే దీనికి నిదర్శనం.భూ పరిపాలన కమిషనర్ తెలంగాణ హైదరాబాద్(సిసిఎల్ఏ) లో రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, నేదునూరు గ్రామానికి చెందిన భూ సమస్య గురించి తేది :09/12/2024 రోజున ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్టి ఫిర్యాదు పై స్పందించిన సీసీఎల్ఏ అధికారులు CCLA' s memo.no: ROR/2867247/2024, 2867231/2024 Dated; 04/02/2025 నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేయగా ఇటు ఫిర్యాదు పై విచారణ జరిపి పూర్తి నివేదిక అందజేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కందుకూరు ఆర్డీవో కు ఫైల్ no: B/1783/2025 తేది;12/04/2025 రోజున కందుకూరు మండల తహసిల్దార్ కు ఆదేశాలు జారీ చెయ్యగా మండల తాహసిల్దార్ కార్యాలయ అధికారులు అయినా మండల సర్వేయర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ తేది:28 మే 2025 నాడు నేడునూరు గ్రామంలో గల భూమి మొఖాపై వచ్చి విచారణ జరిపారు విచారణ జరిపిన రోజు నుండి ఆరు నెలల వరకు ఎలాంటి విచారణ జరిపిన నివేదిక ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం నూతనంగా గ్రామ పాలన అధికారి వ్యవస్థను తీసుకొని రావడంతో భూమి విషయంలో అర్జీ పెట్టుకున్న ఫిర్యాదుదారులకు మండల డిప్యూటీ తాహసిల్దారు జిపిఓ రిపోర్టు కావాలని మళ్లీ భూమి మోకాపై విచారణ జరిపి జిపిఓ నివేదిక తీసుకోవాల్సిందిగా ఫిర్యాదుదారులకు తెలపడంతో జిపిఓ విచారణ నివేదిక గురించి నేడునూరు గ్రామంలో గల భూమి మొఖాపై తేదీ;14 నవంబర్ 2025 నాడు గ్రామ పాలన అధికారి భూమి మొఖాపై వచ్చి విచారణ జరిపారు అప్పటినుండి కందుకూరు మండల తహసిల్దార్ కార్యాలయం చుట్టూ కొన్ని సంవత్సరాలుగా తిరుగుతున్న మండల రెవెన్యూ అధికారులు సమస్యను పరిష్కరించడం లేదని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భూముల విషయంలో అన్యాయం జరగకుండా నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ చట్టం లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులు కందుకూరు మండలం, నేదునూరు గ్రామంలో తేది ;19/06/2025 నాడు జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో అప్లికేషన్ నెంబర్: Rs 2500415815,2500415610 దరఖాస్తు చేసుకోవడం జరిగింది అయినా కూడా ఎలాంటి స్పందన రెవెన్యూ అధికారుల నుంచి లేదు అని అన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఇట్టి భూమిపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని Lr.No.E5/3080/2021,dt;01/07/2021 నాడు ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా కందుకూరు మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మండల అధికారులపై సీసీఎల్ఏ కమిషనర్ జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది