BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

జగిత్యాల వార్డులో బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం

తెలంగాణ
05 Feb, 2026 - 06:05 AM
214 వీక్షణలు
జగిత్యాల 3వ వార్డులో బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం గుమ్మడి సత్యం గౌడ్‌కు మహిళల మద్దతు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ జగిత్యాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జోరు కొనసాగుతోంది. పట్టణంలోని 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గుమ్మడి సత్యం గౌడ్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముమ్మరంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. ప్రచారం సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి, అభ్యర్థికి మద్దతు తెలిపారు. ప్రజల్లో కేసీఆర్‌కు నిలకడైన మద్దతు ఈ సందర్భంగా దావ వసంత మాట్లాడుతూ, ఏ ఇంటి గడప తొక్కినా ప్రజల్లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్ల ఉన్న అభిమానం తగ్గలేదని స్పష్టమవుతోందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థిరమైన స్థానం సంపాదించుకున్నారని, లబ్ధిదారులు స్వచ్ఛందంగా కారు గుర్తుకే మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలపై విమర్శ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందని ఆమె విమర్శించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, మళ్లీ చేయి గుర్తుకు ఓటు వేస్తే మోసపోవడం తప్పదని హెచ్చరించారు. పట్టణ అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్‌తో పాటు పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #Jagityal #BRSCampaign #MunicipalElections #KCR #GrassrootsPolitics #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube