ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేయాలి
తెలంగాణ
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేయాలి
రాయికల్ పట్టణ కార్యకర్తల సమావేశంలో నాయకుల పిలుపు
NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి లక్ష్మణ్
రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎన్నికల ఇంచార్జ్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం రాయికల్ పట్టణంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
అనంతరం, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్గా నియమితులైన విద్యాసాగర్ రావును దావ వసంత సురేష్తో పాటు పట్టణ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
#MunicipalElections
#BRSParty
#Raikal
#JagtialDistrict
#PoliticalMeeting
#TelanganaPolitics
#LocalBodyElections
#NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube