www.ntodaynews.com
విజయవాడలో తగలబడ్డ బస్సు
తెలంగాణ
విజయవాడలో తగలబడ్డ బస్సు
విజయవాడ కృష్ణలంకలో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అగ్నికి ఆహుతి అయింది. బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వివరాలు కి వెళితే విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సు అగ్నికి ఆహుతి అయింది. బస్సులోని గ్యాస్ లీకేజ్ అవ్వడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పి వేశారు. కాగా బారి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Follow us on
Website
Facebook
Instagram
YouTube