చికిత్స పొందుతూ అస్సాం వాసి మృతి
నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని పిట్టంపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అస్సాం రాష్ట్రానికి చెందిన చెరబహదూర్ (47) అనే వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం అస్సాం రాష్ట్రం నాగోల్ జిల్లాకు చెందిన చెరబహదూర్ పిట్టంపల్లిలోని శ్రీ పైప్స్ అండ్ ఇన్ఫ్రా కంపెనీలో కూలీగా పని చేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. ఈ నెల 14న సాయంత్రం వెలిమినేడుకు కూరగాయల కోసం వెళ్లిన ఆయన, తిరిగి రాత్రి 10:30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తుండగా సెవెంటీ కం కంపెనీ వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు.;ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చెరబహదూర్ను చికిత్స నిమిత్తం నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం (తేదీ 18.06.2026) సాయంత్రం ఆయన మృతి చెందాడు. మృతుడి తమ్ముడు అంబహదూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు