BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

చిలకలూరిపేట వైభవంగా బక్రీద్ వేడుకలు

భక్తి భక్తి
28 May, 2026 - 01:11 PM
46 వీక్షణలు

పేటలో వైభవంగా బక్రీద్ వేడుకలు..

ఈద్గాలో వేలాదిగా ముస్లింల సామూహిక ప్రార్థనలు..

​చిలకలూరిపేట పట్టణంలో బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ వేడుకలు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. త్యాగానికి ప్రతిరూపంగా నిలిచే ఈ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఉదయం నుంచే ఆధ్యాత్మిక సంబరాల్లో మునిగిపోయారు.

​కిక్కిరిసిన ఈద్గా మైదానం
​పండుగను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే ముస్లింలు నూతన వస్త్రాలు ధరించి, సుగంధ ద్రవ్యాలు అద్దుకుని పట్టణంలోని ఈద్గా మైదానానికి భారీగా చేరుకున్నారు. వేలాది మంది భక్తులు ఒకే చోట చేరి క్రమశిక్షణతో సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహించారు.భక్తుల రాకతో ఈద్గా మైదానం పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రార్థనల అనంతరం విశ్వమానవ శాంతి, సోదరభావం వర్ధిల్లాలని దువా చేశారు.అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ 'ఈద్ ముబారక్' అంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

*​ప్రముఖుల శుభాకాంక్షలు.. పటిష్ట భద్రత..*

బక్రీద్ ​వేడుకల సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు,వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు ఈద్గా మైదానాన్ని సందర్శించారు.ముస్లిం సోదరులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.పట్టణంలో పండుగ వాతావరణం ప్రశాంతంగా సాగేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కూడా ముస్లింలు బక్రీద్ సంబరాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.