www.ntodaynews.com
చిలకలూరిపేట వైభవంగా బక్రీద్ వేడుకలు
భక్తి
భక్తి
పేటలో వైభవంగా బక్రీద్ వేడుకలు..
ఈద్గాలో వేలాదిగా ముస్లింల సామూహిక ప్రార్థనలు..
చిలకలూరిపేట పట్టణంలో బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ వేడుకలు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. త్యాగానికి ప్రతిరూపంగా నిలిచే ఈ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఉదయం నుంచే ఆధ్యాత్మిక సంబరాల్లో మునిగిపోయారు.
కిక్కిరిసిన ఈద్గా మైదానం
పండుగను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే ముస్లింలు నూతన వస్త్రాలు ధరించి, సుగంధ ద్రవ్యాలు అద్దుకుని పట్టణంలోని ఈద్గా మైదానానికి భారీగా చేరుకున్నారు. వేలాది మంది భక్తులు ఒకే చోట చేరి క్రమశిక్షణతో సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహించారు.భక్తుల రాకతో ఈద్గా మైదానం పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రార్థనల అనంతరం విశ్వమానవ శాంతి, సోదరభావం వర్ధిల్లాలని దువా చేశారు.అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ 'ఈద్ ముబారక్' అంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
*ప్రముఖుల శుభాకాంక్షలు.. పటిష్ట భద్రత..*
బక్రీద్ వేడుకల సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు,వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు ఈద్గా మైదానాన్ని సందర్శించారు.ముస్లిం సోదరులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.పట్టణంలో పండుగ వాతావరణం ప్రశాంతంగా సాగేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కూడా ముస్లింలు బక్రీద్ సంబరాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.