BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

చిట్యాలలో ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
21 Mar, 2026 - 04:38 PM
422 వీక్షణలు

​​చిట్యాలలో ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) వేడుకలు 

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించిన ఉపవాస దీక్షలు విరమిస్తూ, క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను చిట్యాలలో ముస్లిం సోదరులు ఎంతో వేడుకగా జరుపుకున్నారు. శనివారం స్థానిక ఈద్గా వద్ద ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు ‘ఈద్ ముబారక్’ చెప్పుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ​ఈ సందర్భంగా పలువురు నాయకులు ఈద్గాను సందర్శించి, ముస్లిం సోదరులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రంజాన్ పండుగ మానవతా విలువలను, పేదరికం పట్ల సానుభూతిని పెంచుతుందని కొనియాడారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని, ఈ పండుగ అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని వారు ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో    జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్ ,  కౌన్సిలర్లు ​కోనేటి ఎల్లయ్య, ​జేరిపోతుల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు ​పందిరి రమేష్, గుండెబోయిన సైదులు, చేపూరి యాదయ్య, ​ఎద్దుల పూరి కృష్ణ, ​దేశపాక రాజేష్, ​సిలువేరు శేఖర్, దామనూరి అశోక్, బూరుగు కృష్ణయ్య, కొసనం అశోక్,  ​దాసరి నరసింహ ఏనుగు నరసింహారెడ్డి, తరతరాలు పాల్గొన్నారు.