BREAKING
చిట్యాలలో రమాబాయి అంబేద్కర్ వర్ధంతి ​ప్రభుత్వ పాఠశాలల విద్యను ప్రభుత్వం గాలికి వదిలేసింది : ఏబీవీపీ తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సివిల్ సప్లయిస్ హమాలీలకు ఏప్రిల్ నెల వేతనాలు తక్షణమే చెల్లించాలి ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కొత్త రూల్స్.. సిలిండర్ కట్! శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం శాంతియుత వాతావరణంలో బక్రీద్.. మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు.. జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు.. రైలులో చోరీ.. నిందితుల అరెస్టు చిట్యాలలో రమాబాయి అంబేద్కర్ వర్ధంతి ​ప్రభుత్వ పాఠశాలల విద్యను ప్రభుత్వం గాలికి వదిలేసింది : ఏబీవీపీ తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సివిల్ సప్లయిస్ హమాలీలకు ఏప్రిల్ నెల వేతనాలు తక్షణమే చెల్లించాలి ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కొత్త రూల్స్.. సిలిండర్ కట్! శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం శాంతియుత వాతావరణంలో బక్రీద్.. మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు.. జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు.. రైలులో చోరీ.. నిందితుల అరెస్టు
www.ntodaynews.com

చిట్యాలలో రమాబాయి అంబేద్కర్ వర్ధంతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
28 May, 2026 - 09:17 AM
15 వీక్షణలు

నల్గొండ జిల్లా ముత్యాల పట్టణ కేంద్రంలోని కనకదుర్గ సెంటర్‌లో రమాబాయి అంబేద్కర్ 91వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రుద్రవరం లింగస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ​ఈ సందర్భంగా డాక్టర్ రుద్రవరం లింగస్వామి మాట్లాడుతూ... ఆధునిక భారతదేశ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితంలో, ఆయన సాధించిన ప్రతి విజయంలో భార్య రమాబాయి ప్రోత్సాహం, త్యాగం ఎంతో ఉన్నతమైనవని కొనియాడారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి, ఆమె చరిత్రను ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ​ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీను, సీనియర్ నాయకులు చికిలమెట్ల అశోక్, కన్నెబోయిన మహలింగం, గోషిక వెంకటేష్, నార్కట్‌పల్లి మాజీ మండల అధ్యక్షులు కొరివి శంకర్, మహిళా నాయకురాలు దుడ్డు భాగ్యమ్మ, దామరాజు నాగరాజు, పిల్లి రవి మరియు పలువురు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.