చందయపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి జాతరలో మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు
చందయపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి జాతరలో మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు
బుగ్గారం: ఉగాది పండుగను పురస్కరించుకుని బుగ్గారం మండలం చంద్రయ్యపల్లి గ్రామంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం పాల్గొన్నారు.
మంత్రి గ్రామానికి చేరుకోగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న మంత్రి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.