www.ntodaynews.com
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
తెలంగాణ
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
లక్ష్మిదేవి పల్లెలో విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ
NTODAY NEWS: జగిత్యాల
మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొని శివాజీ విగ్రహాలకు పూలమాలలు అర్పించారు.
లక్ష్మిదేవి పల్లెలో భూమి పూజ
సారంగాపూర్ మండలం లక్ష్మిదేవి పల్లె గ్రామంలోని గొల్లవాడ, బతుకమ్మ కుంట సమీపంలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, శివాజీ ఆశయాలు యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తేలు రాజు, మాజీ పాక్స్ చైర్మన్ సాగి సత్యం రావు, సర్పంచ్ శేఖర్, ఉపసర్పంచ్ ఉపేందర్, శివాజీ యూత్ ప్రెసిడెంట్ అంజి, రంజిత్, సాంబారి గంగాధర్, జలంధర్, మనక రమేష్, కొమురయ్య, జక్కుల నరేష్, నవీన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో జయంతి వేడుకలు
జగిత్యాల పట్టణంలోని 49వ వార్డులో నిర్వహించిన వేడుకల్లో కూడా జడ్పీ చైర్పర్సన్ పాల్గొన్నారు. శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ, స్వరాజ్య స్ఫూర్తి సామాజిక ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు.
కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు, కౌన్సిలర్ సిరిపురం శ్రీలత శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, మాజీ కౌన్సిలర్ వొళ్ళాల గంగాధర్, గన్నేరువరం బుచ్చయ్య, గాజుల శ్రీనివాస్, గంగుపెల్లి వేణు, పెండం గంగాధర్, తిరుపతి, సత్తయ్య, భారత్, అజయ్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
ధర్మ ధ్వజ ఆవిష్కరణకు ఆహ్వానం
శివాజీ జయంతి సందర్భంగా నిర్వహించనున్న ధర్మ ధ్వజ పతాక ఆవిష్కరణ మరియు ర్యాలీకి హాజరుకావలసిందిగా ఆహ్వాన కమిటీ సభ్యులు చింత గంగాధర్, సంతోష్, జున్ను రమేష్, కిరణ్, చిరంజీవి, రాజేందర్ తదితరులు ఆహ్వాన పత్రికను అందజేశారు.
#ShivajiMaharaj #ShivajiJayanti #Jagtial #TelanganaNews #Raikal #CulturalEvents #PublicEvent
Follow us on
Website
Facebook
Instagram
YouTube