www.ntodaynews.com
ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి
తెలంగాణ
కొండగట్టు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం NTODAY NEWS: జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, కొండగట్టు మల్యాల మండలం ముత్యంపేటలో ఇటీవల కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.83 లక్షల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు పాల్గొని బాధితులకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, లక్షలాది రూపాయలు అప్పులు చేసి సామాగ్రి తెచ్చుకున్న దుకాణదారులు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దుస్థితిని చూసి ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. ప్రమాద ఘటనను తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, జిల్లా అధికారుల ద్వారా సమగ్ర నివేదిక సమర్పించినట్లు తెలిపారు.
బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి రూ.83,12,000, విద్యుత్ సంస్థ నుంచి రూ.29 లక్షలు, డీఆర్డీఓ ద్వారా మరో రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు మళ్లీ వ్యాపారం ప్రారంభించుకునేలా ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
అదేవిధంగా కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల, రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రాంతాలను టెంపుల్ సిటీ కారిడార్గా అభివృద్ధి చేస్తామని, కొండగట్టు గిరి ప్రదక్షిణ మార్గం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube 