www.ntodaynews.com
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులు
తెలంగాణ
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికైన చిట్యాల విద్యార్థులు
NTODAY NEWS: చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని వనిపాకల, ఎలికట్టే గ్రామాలకు చెందిన నలుగురు విద్యార్థులు నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS)కు ఎంపికయ్యారు. గత సంవత్సరం నవంబర్లో నిర్వహించిన జాతీయస్థాయి పరీక్షలో వారు ప్రతిభ కనబరిచి ఈ అవకాశాన్ని సాధించారు.
ఎంపికైన విద్యార్థులు:
ఎలికట్టే గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థులు – పి. హారిక, ఎస్. కావ్యశ్రీ
వనిపాకల గ్రామం జడ్పీ పాఠశాల 8వ తరగతి విద్యార్థులు – పి. సంజన, ఎం. సిరి
ఈ స్కాలర్షిప్ కింద విద్యార్థులకు ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ.12,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఈ సందర్భంగా వనిపాకల ప్రధానోపాధ్యాయులు శ్రీనయ్య చారి, ఎలికట్టే ప్రధానోపాధ్యాయులు నరసింహ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
#Chityala #NalgondaDistrict #NMMS #NationalMeritScholarship #StudentAchievement #EducationNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube