BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలి

తెలంగాణ
23 Apr, 2025 - 10:22 PM
178 వీక్షణలు
కార్మికుల దినోత్సవం మేడే 1న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలి ... సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్ కొండపల్లి భవన నిర్మాణ కార్మికులకు గత వైసిపి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, కూటమి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డు వెంటనే పునః ప్రారంభిస్తామని భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన ప్రభుత్వం 11 నెల గడుస్తున్న నేటికీ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయడం లేదని , కార్మికుల దినోత్సవం మేడే రోజు సంక్షేమ బోర్డును పునః ప్రారంభించి , లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్ డిమాండ్ చేశారు ... ఈ కార్యక్రమంలో కొండపల్లి భవన నిర్మాణ కార్మిక యూనియన్ (సిఐటియు)ప్రెసిడెంట్ ఆకుల నాగమల్లేశ్వరరావు , ఇబ్రహీంపట్నం భవన నిర్మాణ కార్మిక యూనియన్ (సిఐటియు) ప్రెసిడెంట్ పెండ్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మెమో నెంబర్ 1214 రద్దు చేసి బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును పునఃప్రారంభించాలని గతంలో స్కూటీని ఆమోదించిన క్లైమ్ లను వెంటనే నిధులు చెల్లించాలని , కార్మికుల సంక్షేమ పథకాలు అమలు కోసం వసూలు చేసిన సెస్ నిధులను కార్మికుల సంక్షేమానికి మాత్రమే ఖర్చు చేయాలని, వివిధ సందర్భాల్లో గత ప్రభుత్వాలు ఆక్రమంగా వాడుకున్న వెల్ఫేర్ బోర్డు నిధులను తక్షణమే తిరిగి బోర్డు కు చెల్లించాలని , భవన నిర్మాణ కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు గృహ నిర్మాణాలకు వెల్ఫేర్ బోర్డు ద్వారా సబ్సిడీతో కూడిన లోన్లు మంజూరు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు ఉచిత వైద్యం ,పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని కార్మికులు పని కోసం వేచి ఉండే అడ్డాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, సిమెంట్, స్టీల్ తదిత నిర్మాణం మెటీరియల్ పై జిఎస్టి తగ్గించాలని డిమాండ్ చేశారు... కొండపల్లి స్టేషన్ సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో కొండపల్లి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు)నాయకులు ఎన్ ప్రసాద్, ఎ రమేష్, ఎస్ కె జానీ, శ్రీను , దుర్గా రావు, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube