దేశంలో రూ.1.1 లక్షల కోట్ల అనాథ ఆస్తులు
దేశంలో యజమానుల జాడ లేకుండా ఉన్న ఆర్థిక ఆస్తుల విలువ 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.1.1 లక్షల కోట్లకు చేరినట్లు సమాచారం. ఇందులో సుమారు రూ.83 వేల కోట్లు బ్యాంకు డిపాజిట్లు కాగా, మిగిలిన మొత్తం బీమా పాలసీలు, ఈక్విటీ పెట్టుబడులు తదితర రూపాల్లో ఉంది.
అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అనాథ ఆస్తుల సమస్యలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదు. పాత బ్యాంకు ఖాతాల్లో నామినీ వివరాలు లేకపోవడం, చేతిరాత రికార్డుల కారణంగా కేవైసీ సమాచారం సరిపోలకపోవడం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
దీంతో అసలు లబ్ధిదారులు, వారసులు తమకు చెందాల్సిన నిధులను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిపుణులు ఖాతాదారులు నామినీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు, కేవైసీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని సూచిస్తున్నారు.