BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

డబుల్ ఓట్లకు చెక్.. తప్పుల్లేని ఓటర్ల జాబితాయే లక్ష్యం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
20 Mar, 2026 - 08:17 PM
312 వీక్షణలు

డబుల్ ఓట్లకు చెక్.. తప్పుల్లేని ఓటర్ల జాబితాయే లక్ష్యం: చిట్యాల ఎమ్మార్వో 

చిట్యాల ఇన్చార్జ్ తహశీల్దార్ బి.  విజయలక్ష్మి

ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని చిట్యాల ఇంచార్జ్  తహశీల్దార్ విజయలక్ష్మి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ​ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో లోపాలను సరిదిద్దేందుకు ప్రతి రాజకీయ పార్టీ తమ తరపున ఒక ప్రతినిధిని నియమించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఓట్ల పరిశీలన పారదర్శకంగా జరగాలంటే పార్టీల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు  ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నట్లయితే, అటువంటి వాటిని గుర్తించి చట్టపరంగా తొలగిస్తామని తెలిపారు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించే ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను, నాయకులను కోరారు. ఓటర్ల సవరణ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడటంలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.