దండేపల్లి మండల కేంద్రంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం
దండేపల్లి మండల కేంద్రంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్ పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ.. కేవలం ఇద్దరు సభ్యులతో ప్రారంభమైన బీజేపీ ప్రయాణం, నేడు కోట్ల మంది ఆదరణతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడం ఒక అద్భుత విజయ ప్రస్థానమని కొనియాడారు. జాతీయవాదమే పునాదిగా, ఓటమికి కుంగని ధీరత్వం మరియు గెలుపుకు పొంగని నాయకత్వంతో పార్టీ లక్ష్యం దిశగా సాగుతోందని, భారత్ నిర్మాణ కల సాకారం కావడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు