BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అప్పు తీరినా వదలని మృత్యువు

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
11 Mar, 2026 - 07:55 AM
310 వీక్షణలు
అప్పు తీరినా వదలని మృత్యువు వడ్డీ వ్యాపారి దాడిలో వ్యక్తి మృతి NTODAY NEWS : నార్కెట్ పల్లి నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో బుధవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పు వసూళ్ల విషయంలో తలెత్తిన వివాదం ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఓర్సు శంభులింగం (60) మరియు సుర ఆంజనేయులు మధ్య కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి లోనైన ఆంజనేయులు శంభులింగంపై భౌతిక దాడికి దిగాడు. దాడిలో శంభులింగం ఛాతీపై బలమైన దెబ్బలు తగలడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శంభులింగం మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, గతంలో పెద్దమనుషుల సమక్షంలో ₹80 వేల అప్పును పూర్తిగా చెల్లించినప్పటికీ, ఇంకా డబ్బులు ఇవ్వాలని ఆంజనేయులు వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు. కావాలనే ఇంటికి పిలిపించి శంభులింగంపై దాడి చేశాడని వారు పేర్కొన్నారు. సుర ఆంజనేయులు గతంలో కూడా అధిక వడ్డీలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇతనిపై గతంలోనే పలు కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్కట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు. #Narketpally #CrimeNews #NalgondaDistrict #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube