www.ntodaynews.com
ఢిల్లీలో లోకేష్తో బీకే పార్థసారథి భేటీ... జాతీయ వేదికపై ఏపీ అంశాలపై చర్చ!
జాతీయం
న్యూఢిల్లీ:
ఢిల్లీలో జాతీయ రాజకీయాల సందడి నెలకొన్న వేళ, రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అడ్డా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను హిందూపురం పార్లమెంట్ సభ్యుడు బీకే పార్థసారథి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, విద్యా సంస్కరణలు, ఐటీ రంగ విస్తరణ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
జాతీయ వేదికపై రాష్ట్ర ప్రయోజనాల సాధనకు సంబంధించిన పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ భేటీ ప్రస్తుతం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.