BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

భక్తులకు అన్నప్రసాద వితరణ

తెలంగాణ
03 Jan, 2026 - 08:29 AM
168 వీక్షణలు

ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా పౌర్ణమి పూజలు

భక్తులకు అన్నప్రసాద వితరణ NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ వెల్గటూర్ మండల కేంద్రంలోని రామభక్త ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నోముల జలజ–వెంకటరెడ్డి దంపతుల సౌజన్యంతో ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జలజ–వెంకటరెడ్డి దంపతులను ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్, ప్రముఖులు గుమ్ముల వెంకటేష్, మూగల సతీష్, రంగు అజయ్, మెరుగు ప్రవీణ్, పందిరి వెంకటేష్, మెరుగు రంజిత్, ఆలయ అర్చకులు నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube