ప్రీ-ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్ల పంపిణీ
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
వెల్గటూర్ మండలంలోని పాషిగామ గ్రామ ప్రీ-ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నీలం సంపత్ ఆధ్వర్యంలో యూకేజీ (UKG) విద్యార్థులకు నూతన యూనిఫామ్లు మరియు షూలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు నీలం సంపత్ మాట్లాడుతూ, చిన్నారి విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు సమానత్వ భావన పెంపొందించేందుకు యూనిఫామ్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి మరియు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రుల సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు. తమ పిల్లలకు యూనిఫామ్లు అందజేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. #Pasigam #Velgatoor #SchoolStudents #EducationSupport #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube