BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగడం అభ్యంతరకరం

తెలంగాణ
22 Feb, 2026 - 07:19 PM
270 వీక్షణలు
వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగడం అభ్యంతరకరం: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున తిరుమల వెంకటేశ్వరస్వామిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం తీవ్రంగా అభ్యంతరకరమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బైరెడ్డి శబరి విమర్శించారు. ఈ చర్యల వల్ల వైసీపీ పతనం మొదలైందని ఆమె వ్యాఖ్యానించారు. ఆదివారం భారత తొలి తిరుగుబాటు యోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి 179వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందన్నారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయ వేదికలపై వినియోగించడం, నినాదాలు చేయడం ప్రజల విశ్వాసాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. వైసీపీ నేతలు గత పాలనలో దేవాలయాల రక్షణలో విఫలమయ్యారని ఆరోపించారు. తిరుమలతో సంబంధం ఉన్న పలు ఘటనలను ప్రస్తావిస్తూ, ఇవన్నీ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయని అన్నారు. శాసనమండలిలో జరిగిన నిరసనలపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, వాటిని సమర్థించేందుకు ప్రయత్నించడం సరికాదని చెప్పారు. ప్రస్తుత పాలన ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని సాగుతోందని, అందుకే ప్రతిపక్షానికి భయం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు మాటలతో కాకుండా చర్యలతో బాధ్యత చూపాలని ఆమె సూచించారు. #AndhraPradeshPolitics #NandyalMP #TDP #YSRCP #PoliticalNews #TeluguNews Follow us on Website Facebook Instagram YouTube