BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగడం అభ్యంతరకరం

తెలంగాణ
22 Feb, 2026 - 07:19 PM
213 వీక్షణలు
వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగడం అభ్యంతరకరం: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున తిరుమల వెంకటేశ్వరస్వామిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం తీవ్రంగా అభ్యంతరకరమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బైరెడ్డి శబరి విమర్శించారు. ఈ చర్యల వల్ల వైసీపీ పతనం మొదలైందని ఆమె వ్యాఖ్యానించారు. ఆదివారం భారత తొలి తిరుగుబాటు యోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి 179వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందన్నారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయ వేదికలపై వినియోగించడం, నినాదాలు చేయడం ప్రజల విశ్వాసాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. వైసీపీ నేతలు గత పాలనలో దేవాలయాల రక్షణలో విఫలమయ్యారని ఆరోపించారు. తిరుమలతో సంబంధం ఉన్న పలు ఘటనలను ప్రస్తావిస్తూ, ఇవన్నీ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయని అన్నారు. శాసనమండలిలో జరిగిన నిరసనలపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, వాటిని సమర్థించేందుకు ప్రయత్నించడం సరికాదని చెప్పారు. ప్రస్తుత పాలన ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని సాగుతోందని, అందుకే ప్రతిపక్షానికి భయం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు మాటలతో కాకుండా చర్యలతో బాధ్యత చూపాలని ఆమె సూచించారు. #AndhraPradeshPolitics #NandyalMP #TDP #YSRCP #PoliticalNews #TeluguNews Follow us on Website Facebook Instagram YouTube