BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగడం అభ్యంతరకరం

తెలంగాణ
22 Feb, 2026 - 07:19 PM
180 వీక్షణలు
వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగడం అభ్యంతరకరం: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున తిరుమల వెంకటేశ్వరస్వామిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం తీవ్రంగా అభ్యంతరకరమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బైరెడ్డి శబరి విమర్శించారు. ఈ చర్యల వల్ల వైసీపీ పతనం మొదలైందని ఆమె వ్యాఖ్యానించారు. ఆదివారం భారత తొలి తిరుగుబాటు యోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి 179వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందన్నారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయ వేదికలపై వినియోగించడం, నినాదాలు చేయడం ప్రజల విశ్వాసాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. వైసీపీ నేతలు గత పాలనలో దేవాలయాల రక్షణలో విఫలమయ్యారని ఆరోపించారు. తిరుమలతో సంబంధం ఉన్న పలు ఘటనలను ప్రస్తావిస్తూ, ఇవన్నీ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయని అన్నారు. శాసనమండలిలో జరిగిన నిరసనలపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, వాటిని సమర్థించేందుకు ప్రయత్నించడం సరికాదని చెప్పారు. ప్రస్తుత పాలన ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని సాగుతోందని, అందుకే ప్రతిపక్షానికి భయం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు మాటలతో కాకుండా చర్యలతో బాధ్యత చూపాలని ఆమె సూచించారు. #AndhraPradeshPolitics #NandyalMP #TDP #YSRCP #PoliticalNews #TeluguNews Follow us on Website Facebook Instagram YouTube