BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
23 Mar, 2026 - 01:43 PM
103 వీక్షణలు

గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన.. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్!

హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం అసెంబ్లీ సమీపంలోని గన్ పార్క్ వద్ద భారీ నిరసన చేపట్టారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

​విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు:

"ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొర్రీలు.. పేద విద్యార్థులకు వర్రీలు" అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. గత కొన్ని నెలలుగా ఫీజులు రాక పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

​అసెంబ్లీకి భారీ ర్యాలీ:

గన్ పార్క్ వద్ద నిరసన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అసెంబ్లీ వరకు ర్యాలీగా బయలుదేరారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.