BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

​గూడెం గుట్ట వద్ద టిప్పర్‌లో చెలరేగిన మంటలు

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
08 Apr, 2026 - 03:23 PM
22 వీక్షణలు

​​గూడెం గుట్ట వద్ద టిప్పర్‌లో చెలరేగిన మంటలు: తప్పిన ప్రమాదం

దండేపల్లి, ఏప్రిల్ 08: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గూడెం గుట్ట వద్ద బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ సమీపంలో నిలిపి ఉంచిన ఒక టిప్పర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

దేవాలయ పరిసరాల్లో పార్క్ చేసి ఉన్న టిప్పర్‌లో బుధవారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా పొగలు వచ్చి, మంటలు అంటుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.

​సమయస్ఫూర్తితో అదుపులోకి..

మంటలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో మంటలు వాహనం మొత్తానికి వ్యాపించకుండా ఆగిపోయాయి, దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో వాహనం కొంతమేర దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది