గూడెం గుట్ట వద్ద టిప్పర్లో చెలరేగిన మంటలు
గూడెం గుట్ట వద్ద టిప్పర్లో చెలరేగిన మంటలు: తప్పిన ప్రమాదం
దండేపల్లి, ఏప్రిల్ 08: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గూడెం గుట్ట వద్ద బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ సమీపంలో నిలిపి ఉంచిన ఒక టిప్పర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
దేవాలయ పరిసరాల్లో పార్క్ చేసి ఉన్న టిప్పర్లో బుధవారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా పొగలు వచ్చి, మంటలు అంటుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
సమయస్ఫూర్తితో అదుపులోకి..
మంటలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో మంటలు వాహనం మొత్తానికి వ్యాపించకుండా ఆగిపోయాయి, దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో వాహనం కొంతమేర దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది