BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ
www.ntodaynews.com

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబు

తెలంగాణ
01 Oct, 2024 - 07:06 AM
345 వీక్షణలు
ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి - కుర్మతి రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని సర్వేల్ గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గామాత భక్తజన బృందం కమటి అధ్యక్షుడు చిలక రాజు రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దేవి శరన్నవరాత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. చౌరస్తాలో తలవరి మండపం సన్నిధిలో అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సాహలు అంగరంగ వైభవంగా నిర్వహించబడును. సర్వేల్ గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని.ఈ కార్యక్రమన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాము. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబయింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు. ప్రతి ఏటా దేవీ నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతున్నది. నిమర్జనం శోభాయాత్ర మహా వైభోపేతంగా కన్నుల పండుగగా జరుపుకోవడం జరుగుతుంది. సంస్కృతిక కార్యక్రమాలు ఆదరిస్తాయి. చిలక రాజు రాజు తేదీ 03/ 10/2024 గురువారం రోజు నుండి 13/10/2024 ఆదివారం వరకు దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తేదీ 03 గురువారం రోజున సాయంత్రం 6 గంటలకు తోరణ అలంకరణ, గణపతి పూజ, పుణ్యావాహాచనం, రక్షాబంధనం, అఖండ మండపారాధన, అమ్మవారికి ప్రతిష్ట కలశ స్థాపన జరుపబడును అని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 అమ్మవారికి పంచామృత అభిషేకం కుంకుమ పూజ, తదుపరి అర్చనలు నిర్వహించబడును అని, తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాల్లో (అలంకరణలో) అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది.. తేదీ 7 సోమవారం రోజున ఉదయం 10: 30 నిమిషాలకు శ్రీ మహాచండి హోమం నిర్వహించడం జరుగుతుంది. బుదవారం 9వ రోజున విద్యార్థిని విద్యార్థులచే సరస్వతి దేవి పూజ చేయించబడును అని, అమ్మగారి ప్రసాదంగా పెన్నులు ఇవ్వడును అని, అదేవిధంగా అక్షరాభ్యాసం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 12 వ తేదీ శనివారం రోజున విజయదశమి పురస్కరించుకొని ఉదయం 8 గంటల నుండి అర్చనలు, కుంకుమ పూజలు, వాహన పూజలు మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు శమీపూజ నిర్వహించడం జరుగుతుందని, తదనంతరం అమ్మవారి చీరలు వేలం వేయబడటం నిర్వహించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాలు పాల్గొననున్నారు. గ్రామ మండల ప్రజలు, భక్తులు విచ్చేసి సేవలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయ సహకారాలు అందించి నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయాలని అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.