www.ntodaynews.com
హాజీపూర్లో దారుణం.. కత్తిపోట్లతో వృద్ధుడి హత్య, నిందితుడు లొంగిబాటు
తెలంగాణ
/
మంచిర్యాల
/
హాజీపూర్
మంచిర్యాల జిల్లా హాజీపూర్లో భూ వివాదం ఘోర విషాదానికి దారితీసింది. మండల కేంద్రానికి చెందిన పూదరి భాస్కర్ (65) పై అతని తమ్ముడి కుమారుడు వినయ్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో దాడిని అడ్డుకోబోయిన భాస్కర్ కుమారుడిపై కూడా వినయ్ కత్తితో విరుచుకుపడటంతో అతని చేతికి తీవ్ర గాయమైంది. తీవ్ర రక్తస్రావమైన భాస్కర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ హత్య అనంతరం నిందితుడు వినయ్ నేరుగా హాజీపూర్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం