www.ntodaynews.com
హనీమూన్ టూర్లో విషాదం: విశాఖ యువతి అనుమానాస్పద మృతి
జాతీయం
ఉత్తరాఖండ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నానికి చెందిన గాయత్రి తన భర్తతో కలిసి హనీమూన్ కోసం ముస్సోరి వెళ్లింది.
ఈ జంట ముస్సోరిలోని ఓ హోటల్ రూమ్లో ఉండగా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ముక్కు నుంచి రక్తం రావడం గమనించడంతో కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.