www.ntodaynews.com
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు సద్దుమణిగిన వేళ.. సురక్షితంగా దాటిన 30 భారత నౌకలు
జాతీయం
ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన దౌత్య చర్చలు సఫలం కావడంతో ఈ సముద్ర మార్గంలో నౌకల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
ఈ పరిణామం భారత్కు ఊరటనిచ్చింది. భారతదేశానికి చెందిన 30 నౌకలు ఇప్పటికే హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటగా, మరో 26 నౌకలు ప్రయాణ అనుమతి కోసం క్యూలైన్లో వేచి ఉన్నట్లు భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి రావడం అంతర్జాతీయ వాణిజ్యానికి, ఇంధన సరఫరాకు సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.