www.ntodaynews.com
శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో హుండీ చోరీ
తెలంగాణ
శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో హుండీ చోరీ
NTODAY NEWS:ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి ప్రతినిధి వీరమల్ల శ్రీను
రాచన్నగూడెం గ్రామంలోని గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఆలయ తాళాలు బద్దలు కొట్టి లోపల ఉన్న హుండీని దుండగులు ఎత్తుకుపోయారు.
మంగళవారం ఉదయం పూజా కార్యక్రమాల కోసం ఆలయానికి వెళ్లిన అర్చకులు తాళాలు పగులగొట్టబడిన విషయాన్ని గమనించారు. అనంతరం హుండీ కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
#EluruDistrict #Jeelugumilli #Rachannagudem #TempleTheft #Hunditheft
Follow us on
Website
Facebook
Instagram
YouTube