BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఇండ్ల మధ్యనే మురికికంపు, దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్న పట్టించుకొని పాలకులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
10 Apr, 2026 - 07:02 PM
229 వీక్షణలు

ఇండ్ల మధ్యనే మురికికంపు, దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్న పట్టించుకొని పాలకులు-- సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల  శ్రీశైలం

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, రంగాపురం గ్రామంలో  ఇండ్ల మధ్యనే డ్రైనేజీ లైన్ లేక చెత్త చేదారంతో కంపు, దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్న పాలకులు పట్టించుకోవడం లేదని, వెంటనే చెత్తను తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల  శ్రీశైలం డిమాండ్ చేశారు. పార్టీ పిలుపు మేరకు శుక్రవారం రోజున సమస్యలపై పోరుయాత్ర లో భాగంగా పార్టీ నాయకులతో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  రంగాపురం గ్రామంలో డ్రైనేజీ లైన్లో  ఇండ్ల మధ్యన దాదాపు అరకిలోమీటర్ పొడువునా కాల్వలో చెత్త చేదారం చేరి, కంపు దుర్వాసనతో చుట్టుప్రక్కల ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని అన్నారు.అధికారులు తక్షణమే స్పందించి వెంటనే డ్రైనేజీ లైన్లను  పూర్తి చేయాలని అన్నారు డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగాపురం గ్రామ కమిటీ కార్యదర్శి మైలారం లక్ష్మయ్య, సత్యనారాయణ, కృష్ణమ్మ, సత్తమ్మ, బుచ్చమ్మ, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు