ఇండ్ల మధ్యనే మురికికంపు, దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్న పట్టించుకొని పాలకులు
ఇండ్ల మధ్యనే మురికికంపు, దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్న పట్టించుకొని పాలకులు-- సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, రంగాపురం గ్రామంలో ఇండ్ల మధ్యనే డ్రైనేజీ లైన్ లేక చెత్త చేదారంతో కంపు, దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్న పాలకులు పట్టించుకోవడం లేదని, వెంటనే చెత్తను తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం డిమాండ్ చేశారు. పార్టీ పిలుపు మేరకు శుక్రవారం రోజున సమస్యలపై పోరుయాత్ర లో భాగంగా పార్టీ నాయకులతో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంగాపురం గ్రామంలో డ్రైనేజీ లైన్లో ఇండ్ల మధ్యన దాదాపు అరకిలోమీటర్ పొడువునా కాల్వలో చెత్త చేదారం చేరి, కంపు దుర్వాసనతో చుట్టుప్రక్కల ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని అన్నారు.అధికారులు తక్షణమే స్పందించి వెంటనే డ్రైనేజీ లైన్లను పూర్తి చేయాలని అన్నారు డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగాపురం గ్రామ కమిటీ కార్యదర్శి మైలారం లక్ష్మయ్య, సత్యనారాయణ, కృష్ణమ్మ, సత్తమ్మ, బుచ్చమ్మ, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు