ఇంటర్ ఫలితాల్లో మెరిసిన బీసీ బిడ్డలు
ఇంటర్ ఫలితాల్లో మెరిసిన బీసీ బిడ్డలు: సాయి చరణ్, అకిరా జానులకు ఘన సన్మానం
మంచిర్యాల, ఏప్రిల్ 13:
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన బీసీ విద్యార్థులను జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాలలోని జన్మభూమి నగర్లో ఘనంగా సన్మానించారు.
ప్రతిభావంతులు:
ఎర్రవేణి అకిరా జాను: 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించారు.
కురిమిళ్ళ సాయి చరణ్: 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అత్యంత వెనుకబడిన నాయి బ్రాహ్మణ, గొల్ల కురుమ కులాలకు చెందిన ఈ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రాణించడం గర్వకారణమన్నారు. తల్లిదండ్రులు కులవృత్తులు చేసుకుంటూ పడుతున్న కష్టాన్ని గుర్తించి, క్రమశిక్షణతో చదివి బీసీల సత్తా చాటారని కొనియాడారు. భవిష్యత్తులో వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించి, బీసీల స్థితిగతులను మార్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
పాల్గొన్న నాయకులు:
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రామగిరి రాజన్న చారి, వేముల అశోక్, తిరుపతి, కురిమిళ్ళ రాజేష్, కురుమిళ్ళ శ్రీనివాస్, అంకం సతీష్ తదితరులు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు