BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

తెలంగాణ
05 Feb, 2026 - 09:56 AM
224 వీక్షణలు
శ్రీ లక్ష్మి నర్సింహా కాలనీలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ NTODAY NEWS:  గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే ధర్మపురి పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీలక్ష్మి నర్సింహా స్వామి కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. సంక్షేమ పాలన: గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తోందని, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు తగిన న్యాయం జరగలేదని మంత్రి విమర్శించారు. గోదావరి పుష్కరాలకు నిధులు: 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ధర్మపురి క్షేత్రానికి భారీ నిధులు రావాలంటే మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం కీలకమని అన్నారు. 15 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎంకు ఇచ్చిన మాట: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు ఇచ్చిన మాట ప్రకారం ధర్మపురి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి, పట్టణాభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. కొత్త హామీలు: ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #Dharmapuri #MunicipalElections #CongressCampaign #TelanganaPolitics #UrbanDevelopment #AdluriLaxmanKumar #RevanthReddy Follow us on Website Facebook Instagram YouTube