www.ntodaynews.com
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తెలంగాణ
ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
NTODAY NEWS: కుప్పం ప్రతినిధి రాజశేఖర్
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కందుకూరి వీరేశలింగం ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపకులపతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. మహిళల సమానత్వం, స్వేచ్ఛ మరియు హక్కుల కోసం జరిగిన పోరాటాలను స్మరించుకోవడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. యూరప్ మరియు ఉత్తర అమెరికాలో 20వ శతాబ్దం ప్రారంభంలో జరిగిన కార్మిక ఉద్యమాలు, మహిళా ఓటుహక్కు ఉద్యమాల ప్రభావంతో ఈ దినోత్సవం ప్రారంభమైందని వివరించారు.
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ సరోజిని నాయుడు, ఇందిరా గాంధీ, సుజాత కృపాలిని వంటి మహిళా నాయకులు సమాజానికి చేసిన సేవలను గుర్తు చేశారు. డీన్ (అకాడెమిక్ అఫైర్స్) ప్రొఫెసర్ కె. శ్యామల మాట్లాడుతూ దేశ రక్షణలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
స్కూల్ డీన్ ప్రొఫెసర్ కె. శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి మహిళ తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కుటుంబం మరియు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. మహిళా సెల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ జయలలిత మహిళల అభివృద్ధి, వారు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా డా. ఆర్. మోనిషా (అసిస్టెంట్ ప్రొఫెసర్, సైకియాట్రీ విభాగం, కేజీఎఫ్) మరియు డా. కె. నందిని (జనరల్ ఫిజిషియన్, పీఈఎస్ ఆసుపత్రి, కుప్పం) పాల్గొన్నారు. డా. మోనిషా స్ట్రెస్ మేనేజ్మెంట్, ఆత్మహత్య నివారణ మరియు డిజిటల్ వెల్-బీయింగ్ పై అవగాహన కల్పించగా, డా. నందిని మహిళల ఆరోగ్యం మరియు పోషకాహారం ప్రాముఖ్యతపై ఉపన్యాసం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కోఆర్డినేటర్ కళావతి, విశ్వవిద్యాలయం బోధన మరియు బోధనేతర సిబ్బంది, స్టూడెంట్ కౌన్సిల్ విద్యార్థులు పాల్గొన్నారు.
#DravidianUniversity #Kuppam #WomensDay2026 #WomenEmpowerment #EducationNews #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube