www.ntodaynews.com
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సైబర్ మోసం
తెలంగాణ
/
జనగామ
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సైబర్ మోసం – "వికసిత్ భారత్" పథకం పేరుతో లక్ష రూపాయలు కాజేసిన కేటుగాడు!
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయారు. "వికసిత్ భారత్" పథకం పేరుతో అర్హుల జాబితా పంపిస్తే రూ. 10 లక్షల రుణాలు అందిస్తామని చెప్పి, నిందితుడు లక్ష రూపాయలను కాజేశాడు. ఒక్కొక్కరికి ₹2,500 చొప్పున ₹1 లక్ష ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం, తర్వాత మరిన్ని డబ్బులు అడగడంతో మోసం బయటపడింది.
ఈ ఘటనపై వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పల్లా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.