BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూల్చివేతలే అభివృద్ధియా?

తెలంగాణ
/ తెలంగాణ / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 04:05 PM
181 వీక్షణలు

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూల్చివేతలే అభివృద్ధియా? – మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను గాలికొదిలేసి, కేవలం కూల్చివేతలపైనే తన ప్రతాపాన్ని చూపుతోందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుపై నిప్పులు చెరిగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'హైడ్రా' పేరుతో పేదల ఇళ్లను కూలుస్తుంటే, మంచిర్యాలలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అదే పంథాను కొనసాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సామాన్యుల గూడు చెడగొడుతూ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ నాయకులు చేస్తున్న బెదిరింపులకు ప్రజలెవరూ భయపడవద్దని, అధికార గర్వంతో విర్రవీగుతున్న వారిని ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలంతా కలిసి ఎండగట్టాలని ఆయన కోరారు