BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఈ నెల 13న బీఆర్ఎస్‌లో చేరనున్న తాటిపర్తి జీవన్ రెడ్డి

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 07:38 AM
72 వీక్షణలు

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఈ నెల 13న బీఆర్ఎస్‌లో చేరనున్న తాటిపర్తి జీవన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకోబోతోంది. తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రచారానికి తెరపడింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన ఆయన అధికారికంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 13న తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకోనున్నారు.

ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ నెల 7న కీలక రాజకీయ కదలికలు చోటుచేసుకోనున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. దీంతో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ సందడి మొదలుకానుంది.

జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాల కోటలో బీఆర్ఎస్ బలం మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆయనలాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు రావడం వల్ల ఉమ్మడి జిల్లాలో పార్టీకి కొత్త ఊపు వస్తుందని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు.

ఈ చేరికను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చేరిక అనంతరం జగిత్యాలలోనే పార్టీ ప్లీనరీ నిర్వహించే అవకాశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. ఆ సభలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని సమాచారం.

జగిత్యాల వేదికగా జరిగే ఈ భారీ సభ ద్వారా ఉత్తర తెలంగాణలో తమ పట్టు మరింత బలోపేతం చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా సేవలందించిన జీవన్ రెడ్డి పార్టీ మార్పు ఆ పార్టీకి గట్టి దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.