BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కుళ్లిపోయిన గుడ్లతో తినుబండారాలు తయారీ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 11:36 PM
115 వీక్షణలు

కుళ్లిపోయిన గుడ్లతో తినుబండారాలు తయారీ – ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్, మార్చి 25: నగరంలోని కాటెదాన్ ప్రాంతంలో అక్రమంగా ప్రమాదకర ఆహార పదార్థాల తయారీ నిర్వహిస్తున్న ముఠాపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడిలో “మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ” పేరుతో నడుస్తున్న యూనిట్‌లో కుళ్లిపోయిన కోడిగుడ్లు, హానికర రసాయనాలతో డోనట్స్, కేకులు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

అరెస్టైన నిందితులు అఫ్రిది అన్సారీ (22), యాసిన్ (32), ఖత్రేషన్‌గా పోలీసులు తెలిపారు. వీరు మార్కెట్ నుండి పాడైన, పగిలిన గుడ్లను సేకరించి వాటిలో సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్ వంటి రసాయనాలు కలిపి అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

ఈ దాడిలో 330 కుళ్లిపోయిన గుడ్లు, భారీగా రసాయనాలు, 150 కిలోల తయారైన కేకులు, డోనట్స్, అలాగే డాల్డా, మిల్క్ పౌడర్‌తో పాటు మిక్సింగ్ మెషీన్లు, ఓవెన్లు తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 268/2026 కింద సెక్షన్ 318(4), 274 BNS ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని డీసీపీ అభినందించారు.