కుళ్లిపోయిన గుడ్లతో తినుబండారాలు తయారీ
కుళ్లిపోయిన గుడ్లతో తినుబండారాలు తయారీ – ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్, మార్చి 25: నగరంలోని కాటెదాన్ ప్రాంతంలో అక్రమంగా ప్రమాదకర ఆహార పదార్థాల తయారీ నిర్వహిస్తున్న ముఠాపై మైలార్దేవ్పల్లి పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడిలో “మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ” పేరుతో నడుస్తున్న యూనిట్లో కుళ్లిపోయిన కోడిగుడ్లు, హానికర రసాయనాలతో డోనట్స్, కేకులు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
అరెస్టైన నిందితులు అఫ్రిది అన్సారీ (22), యాసిన్ (32), ఖత్రేషన్గా పోలీసులు తెలిపారు. వీరు మార్కెట్ నుండి పాడైన, పగిలిన గుడ్లను సేకరించి వాటిలో సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్ వంటి రసాయనాలు కలిపి అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ దాడిలో 330 కుళ్లిపోయిన గుడ్లు, భారీగా రసాయనాలు, 150 కిలోల తయారైన కేకులు, డోనట్స్, అలాగే డాల్డా, మిల్క్ పౌడర్తో పాటు మిక్సింగ్ మెషీన్లు, ఓవెన్లు తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 268/2026 కింద సెక్షన్ 318(4), 274 BNS ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని డీసీపీ అభినందించారు.