లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శాసన మండలి చైర్మన్ శుక్రవారం పంపిణీ చేశారు. ఉరుమడ్ల గ్రామంలోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో చిట్యాల మండలానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.3,21,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు.
ఆపద సమయంలో తమకు అండగా నిలిచి, వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను త్వరగా మంజూరు చేయించినందుకు లబ్ధిదారులు ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి సాగర్ల భాను భిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.