BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​లక్షెట్టిపేటలో ఘనంగా వానమహోత్సవం

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Jun, 2026 - 04:11 PM
196 వీక్షణలు

​పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్

​స్థానిక ఐబీ ప్రాంగణంలో ఉత్సాహంగా మొక్కలు నాటే కార్యక్రమం

​లక్షెట్టిపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'వానమహోత్సవం' సందర్భంగా లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక ఐబీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్‌పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్ హాజరై మొక్కలు నాటి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.

​ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించి చెట్టుగా పెంచినప్పుడే వానమహోత్సవం లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సత్యనారాయణ, రాజు, తోట సువర్ణ రవి, చంద్రమౌళి, కో-ఆప్షన్ సభ్యులు చింత సువర్ణ అశోక్ కుమార్, తబస్సుమ్ హజీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు