లోక్ అదాలత్లో లంచం… ఏఎస్ఐ అరెస్ట్!
లోక్ అదాలత్లో లంచం… ఏఎస్ఐ అరెస్ట్!
లోక్ అదాలత్ విచారణ పేరుతో అవినీతి చేతులు చాపిన పోలీస్ అధికారి ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఒక క్రిమినల్ కేసును రాజీ చేయడానికి రూ.15,000 లంచం తీసుకుంటుండగా చైతన్యపురి పోలీస్ స్టేషనుకు చెందిన అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)ను అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు.
నిందితుడైన అధికారి పి. బాలయ్య రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో విధుల్లో ఉండగానే ఏసీబీ బలగాల చేతికి చిక్కాడు. లోక్ అదాలత్లో ఫిర్యాదిదారు మరియు నిందితుడి మధ్య కేసు పరిష్కారానికి సహకరిస్తానని చెప్పి, అందుకు ప్రతిఫలంగా లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
పట్టుబడిన సమయంలో అతని వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో పోలీస్ శాఖలో అవినీతి మరోసారి వెలుగులోకి రావడం గమనార్హం.