BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

లోన్ల పేరిట మోసం ఇద్దరు మహిళలపై కేసు నమోదు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
07 Jun, 2026 - 09:52 AM
13 వీక్షణలు

రుణాలు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి, లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఇద్దరు మహిళలపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వివరాలను సీఐ ప్రమోద్ రావు శనివారం వెల్లడించారు.

​పోలీసుల కథనం ప్రకారం... ఇక్బాల్ అహ్మద్ నగర్ కు చెందిన బద్రున్నిసా, మరియు గోపాలవాడకు చెందిన అరవ సుబ్బలక్ష్మి అనే ఇద్దరు మహిళలు సులభంగా లోన్లు ఇప్పిస్తామని నమ్మబలికారు. రూ. 5 లక్షల లోన్ ఇప్పిస్తామంటూ దాదాపు పది మంది బాధితుల నుండి విడతల వారీగా మొత్తం రూ. 3 లక్షల వరకు వసూలు చేశారు.

​డబ్బులు తీసుకుని ఎంతకాలమైనా లోన్ రాకపోవడంతో, బాధితులు సదరు మహిళలను నిలదీశారు. అయితే వారి నుంచి ఎటువంటి సరైన సమాధానం రాకపోగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. శనివారం బాధితురాలు షేక్ రిజ్వానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులైన ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు