లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ
మండిపోతున్న ఎండల దృష్ట్యా వీధి వ్యాపారుల కష్టాలను గుర్తించి వారికి నీడనందించడం అభినందనీయమని మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు అన్నారు.శనివారం చిట్యాల మున్సిపాలిటీలో లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో ప్రముఖ దాత గుడిపూడి వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో వీధి వ్యాపారులకు గొడుగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్ చైర్మన్ మాట్లాడుతూ సమాజ సేవలో లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని కొనియాడారు. వేసవి తాపానికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారులకు ఈ గొడుగులు ఎంతో ఊరటనిస్తాయని పేర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వ్యాపారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమానికి వెన్నెముకగా నిలిచిన గుడిపూడి వెంకటేశ్వరరావును స్థానికులు, క్లబ్ సభ్యులు అభినందించారు. ఎండలో వ్యాపారం చేసుకునే తమకు అండగా నిలిచినందుకు వీధి వ్యాపారులు క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పందిరి రమేష్, రేగులగడ్డ నర్సింహా గౌడ్, కొల్లోజు శ్రీకాంత్, కోనేటి ఎల్లయ్య, ఏర్పుల పరమేష్, పెందోట రవింద్రచారి , బొబ్బలి రామ్ రెడ్డి , దేశపాక రాజేష్, స్థానిక నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.