BREAKING
మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక హక్కుల కోసం గళమెత్తిన ఏఐసిసిటియు తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలి మరణంలోనూ బిడ్డను వదలని తల్లి ప్రేమ బాలికల భవిష్యత్తుకు బలమైన అడుగు కష్టాల కడలిలో ఈదుతూ రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించిన పవిత్ర అన్నారంలో వైభవంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు దుర్మరణం మే 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాధవరం రాక జాతీయ సమైక్యతకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీలకం మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక హక్కుల కోసం గళమెత్తిన ఏఐసిసిటియు తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలి మరణంలోనూ బిడ్డను వదలని తల్లి ప్రేమ బాలికల భవిష్యత్తుకు బలమైన అడుగు కష్టాల కడలిలో ఈదుతూ రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించిన పవిత్ర అన్నారంలో వైభవంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు దుర్మరణం మే 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాధవరం రాక జాతీయ సమైక్యతకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీలకం
www.ntodaynews.com

మే 2న ఫోన్లలో సైరన్ శబ్దం పరీక్ష భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 08:44 PM
59 వీక్షణలు

మే 2న ఫోన్లలో సైరన్ శబ్దం పరీక్ష భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టత

రేపు దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది అయితే ఇది ఎలాంటి ప్రమాద సూచన కాదని పూర్తిగా పరీక్ష మాత్రమేనని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది భవిష్యత్తులో వరదలు తుఫానులు భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను తక్షణమే అప్రమత్తం చేయడానికి రూపొందించిన అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు టెలికమ్యూనికేషన్ శాఖ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నాయి ఈ పరీక్షలో భాగంగా మొబైల్ ఫోన్లకు ఒకేసారి పరీక్ష సందేశం చేరడంతో పాటు పెద్ద సైరన్ శబ్దం వినిపించనుంది ఇది కేవలం వ్యవస్థ పనితీరు పరిశీలన మాత్రమేనని అధికారులు తెలిపారు ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ అంతర్జాతీయ సిఫారసుల ఆధారంగా రూపొందిన సందేశ ప్రమాణ విధానం ప్రకారం పనిచేస్తుండగా ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలులో ఉంది ఈ సాంకేతికత ద్వారా విపత్తు సమయంలో సెకన్లలోనే లక్షల మందికి సమాచారం చేరే అవకాశం ఉండగా వరదలు తుఫానులు వంటి ప్రమాదాల ముందు ముందస్తు హెచ్చరికలు పంపి ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు ప్రమాదం ఉన్న ప్రాంతంలోని ఫోన్లకే హెచ్చరికలు పంపే విధంగా ఈ వ్యవస్థ రూపొందించబడినట్లు కేంద్రం వెల్లడించింది