BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

మే 2న ఫోన్లలో సైరన్ శబ్దం పరీక్ష భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 08:44 PM
133 వీక్షణలు

మే 2న ఫోన్లలో సైరన్ శబ్దం పరీక్ష భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టత

రేపు దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది అయితే ఇది ఎలాంటి ప్రమాద సూచన కాదని పూర్తిగా పరీక్ష మాత్రమేనని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది భవిష్యత్తులో వరదలు తుఫానులు భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను తక్షణమే అప్రమత్తం చేయడానికి రూపొందించిన అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు టెలికమ్యూనికేషన్ శాఖ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నాయి ఈ పరీక్షలో భాగంగా మొబైల్ ఫోన్లకు ఒకేసారి పరీక్ష సందేశం చేరడంతో పాటు పెద్ద సైరన్ శబ్దం వినిపించనుంది ఇది కేవలం వ్యవస్థ పనితీరు పరిశీలన మాత్రమేనని అధికారులు తెలిపారు ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ అంతర్జాతీయ సిఫారసుల ఆధారంగా రూపొందిన సందేశ ప్రమాణ విధానం ప్రకారం పనిచేస్తుండగా ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలులో ఉంది ఈ సాంకేతికత ద్వారా విపత్తు సమయంలో సెకన్లలోనే లక్షల మందికి సమాచారం చేరే అవకాశం ఉండగా వరదలు తుఫానులు వంటి ప్రమాదాల ముందు ముందస్తు హెచ్చరికలు పంపి ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు ప్రమాదం ఉన్న ప్రాంతంలోని ఫోన్లకే హెచ్చరికలు పంపే విధంగా ఈ వ్యవస్థ రూపొందించబడినట్లు కేంద్రం వెల్లడించింది